

జనం న్యూస్ జాన్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. గురువారం ఆకుపాముల గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.. రైతులు తమ సమస్యల దరఖాస్తులను సదస్సులలో అందజేయాలన్నారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాలను చూపించాలని అధికారులను ఆదేశించారు. భూభారతి రెవెన్యూ సదస్సులను సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
