Listen to this article

జాయింట్ డైరెక్టర్ పట్టు పరిశ్రమ అధికారి డి. అనసూయ..

జనం న్యూస్ 5 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పట్టు పరిశ్రమ శాఖ సి. ఆర్. సి. ఫారం లో జాయింట్ డైరెక్టర్ పట్టు పరిశ్రమ అధికారిని శ్రీమతి డి. అనసూయ పర్యావరణ పరిరక్షణ క్రింద సహజ సిద్ధమైన మల్బరీ మొక్కలు ప్రకృతిని కాపాడుచు సహజ సిద్ధమైన మల్బరీ మొక్కల ఆకులు పట్టు పురుగులకు ఆహారముగా తీసుకుని పట్టు రైతులకు నెల నెల ఆదాయం పొందవచ్చును మల్బరీ మొక్కలు నాటుట వలన చుట్టు పక్కల వాతావరణం కలిగి ఉండును. దీని వలన భూమి లోనీ సారాంశం కాపాడుతూ రాబోయే తరానికి నాణ్యమైన భూమిని ఇవ్వగలం సెంటర్ సిల్క్ బోర్డు చైర్మెన్ ఆదేశాల ప్రకారం మల్బరీ మొక్కలు నాటడం జరిగినది.
ఈ సందర్భంగా పట్టు రైతులకు సెంటర్ సిల్క్ బోర్డు సమగ్ర సిల్క్ -2 క్రింద ఎస్సీ /ఎస్టి రైతులకు రేరింగ్ గది నిర్మాణం కోసం ₹ 2,93,500/- మల్బరీ తోట 2-00 ఎకరాల తోట నాటుకోవాలి ఇందుకు ప్లాంటేషన్ కు 78,000/
300, నేత్రకలు,10 ట్రేస్ ఇరిగేషన్ కొరకు 60,000/- ఇవ్వడం జరుగును. అలాగే బీసీ/ఓసి రైతులకు రేరింగ్ గది నిర్మాణం కోసం 2,25,000/ ప్లాంటేషన్ కు 60,000/ 300 నేత్రికలు,10 ట్రేస్ ఇరిగేషన్ కొరకు 50,000/ ఇవ్వబడును అలాగే ఉపాధి హామీ పథకం కింద రైతులకు మెంటనేషన్ ఇవ్వబడును. పట్టు గుళ్ళ కు కిల్లో కు బోనస్ 75/- ఇవ్వబడును. ఈ కార్యక్రమంలో ఎం. సారంగపాణి, పట్టు పరిశ్రమ అధికారి,కె.సంజీవ్ రెడ్డీ, పట్టు పరిశ్రమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.