Listen to this article

జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొండకరకాంకు చెందిన ప్రమోద్‌ కుమార్‌, చిన్నారావు సునీల్‌ బైక్‌పై విజయనగరం నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో RTO ఆఫీస్‌ సమీపంలో బొలెరో వాహనాన్ని వీరి బైక్‌ బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చిన్నారావు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.