

(జనం న్యూస్ చంటి జూన్ 6)
అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ
కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అనేక ఉపాధ్యాయ శిక్షణలు పొంది ఉపాధ్యాయులు నైపుణ్యముతో విద్యాబోధన చేస్తారని సూచించారు. కావున గ్రామంలోని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలోనే అడ్మిషన్ పొందేలా చూడాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు గల గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొమ్మాట ప్రధానోపాధ్యాయులు బాసిత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం ఉపాధ్యాయులు యాదగిరి కిషన్ రెడ్డి రమేష్ సర్దార్ హుస్సేన్ నిర్మల సుధాకర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సిఆర్పిలు అంగన్వాడి కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
