

బిఎస్పి సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్
జనం న్యూస్, జూన్ 6 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము చంద్రం, అధ్యక్షత ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని, ఆధిపత్య కులాహంకారంతో ఇష్టం వచ్చినట్లు దళిత విద్యార్థుల పైన ఇష్టం వచ్చినట్లు, వివక్ష చూపుతూ మాట్లాడటం బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. విద్యార్థులు పాష్ కుటుంబాల నుండి రాలేదు, వాళ్ళు బాత్రూంలు కడగాలి అనడం వెనుక అంతర్వేమిటి అని ప్రశ్నించారు. అలుగు వర్షిణిని ప్రభుత్వం గురుకుల హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు చదువు నేర్పించి, వారి చదువుకు అవసరమైన సౌకర్యాలు అందించడం కోసం ప్రభుత్వం నియమించింది గాని, విద్యార్థులు ఏ పని చేయాలని చెప్పే హక్కు తనకు లేదు అనేది తను గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం. మరి ఇలాంటి వాక్యాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ గురుకుల విద్యార్థుల పైన చేయడాన్ని మద్దతు ఇస్తుందా?మద్దతు ఇవ్వకపోతే ఆమెను విధుల నుంచి ఎందుకు తొలగించలేదనే విషయం తెలంగాణ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సి అవసరం ఉంది. ప్రజాపాలన సమాన పాలన అని చెప్పుకుంటు తిరిగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు ఎస్సీ విద్యార్థుల పట్ల అలుగు వర్షిని చేసిన వాక్యాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.అలుగు వర్షిని, ఐఏఎస్ ను గురుకుల కార్యదర్శి విధుల నుంచి తొలగించాలని బిఎస్పి డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోశాధికారి ఆశని కనక ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.