Listen to this article

జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం

:అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లారస్ అడ్మిన్ భవనంలో పీఎం నరేంద్ర మోడీ,సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వికసిత్ భారత్ @2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తున్న స్వర్ణాంధ్ర @2047ను యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ ను నియోజకవర్గం స్థాయిలో ఉన్న వివిధ విభాగాల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంను రాబోయే రోజులలో ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలను అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని,వివిధ విభాగాల అధికారుల సూచనలతో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని విజన్ యాక్షన్ ప్లాన్ బృందంను ఆదేశించారు.యలమంచిలి నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా ప్రధానంగా పర్యాటక రంగాల్లో భాగంగా కొండకర్ల ఆవ, సీతపాలెం,పూడిమడక, తంతడి,లోవపాలెం సముద్ర తీర ప్రాంతాలు మరియు పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేసేందుకూ ప్రణాలికలు రూపోందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అభివృద్ధిలో ఎలమంచిలి నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా మనందరం కలిసి స్నేహభావంతో పనీ చేయాలనీ అధికారులను విజ్ఞప్తి చేశారు.ఈ నెల 9న కొత్తూరు ధన దిబ్బలు వద్ద నిర్వహించే యోగా డే కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, వివిధ జిల్లాల ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.