Listen to this article

జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తామన్నారు. మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆరోపించారు.