

జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం లో సన్న బియ్యానికి డిమాండ్ పెరిగింది తెలంగాణ రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి కిలో నిలబడలేక ఇబ్బందికి గురవుతున్నారు ఎక్కువ సమయం క్యూలో నిలబడలేక లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటల నుంచి క్యూలో నిలబడి ఉన్న తర్వాత సర్వర్ సమస్య ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో సన్నబియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది రేషన్ దుకాణాల్లో తెలుపు రంగు రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఇంతటి రద్దీ ఉండేది కాదని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు చాలావరకు బియ్యాన్ని తీసుకునేవారు కాదని కొందరు తీసుకునేవారు మరికొందరు బియ్యాన్ని బయట వ్యాపారులకు విక్రయించే వారిని చెబుతున్నారు సన్న బియ్యం కావడంతో అందులో నూ ఉచితంగా ఇవ్వడం ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాడంతో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది తెలంగాణలో మొత్తం తొంబై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అందులో మూడు కోట్ల మందికి సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది ప్రతి నెల రేషన్ దుకాణాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియాన్నే సరఫరా చేస్తుంది. ఎక్కడ బియ్యం కొడతా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కొత్త రేషన్ కార్డులు వస్తే మరో ముప్పై లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుందన్నారు ఈ సన్న బియ్యం పథకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 10,615 కొట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వెల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది అదనంగా ప్రభుత్వంపై మూడు కోట్ల రూపాయలు భారం పడినప్పటికీ గతంలో ఆరవై శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకునేవారని ఇప్పుడు వంద శాతము మంది తీసుకోవడం పథకం విజయవంతమైందని చెప్పడానికి ఈ ఉదాహరణ అన్ని ప్రభుత్వ వర్గాలు ఇ సమయంలో మూడు నెలల పాటు భారీ వర్షాలు వరదలు ఉంటాయని భావించి మూడు నెలలకు కలిపి ఒకేసారి సన్న బియ్యం ఇస్తున్నాడంతో దీనికి డిమాండ్ ఏర్పడింది అందుకే రేషన్ దుకాణాల వద్దకు క్యూ కడుతున్నారు అనేక చోట్ల రద్దీ ఎక్కువగా ఉండడంతో బియ్యం తీసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది
