Listen to this article

జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని వివిధ గ్రామాలలో పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండలంలోని 23 గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు అనంతరం మండలం లోని గంగిరేణిగూడెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ప్రభుత్వ భవనాల పై పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇళ్ల పై పెట్టలేదని తెలిపారు సీ ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు రూపాయలు 22 వేల 500 కోట్లను పేద ప్రజలకు ఖర్చున పెట్టి సొంతింటి కలల కోసం కేటాయించారు అని తెలిపారు ఇందులో భాగంగా నిరుపేదలకు మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది ఇందిరమ్మ ఇళ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని ఎక్కడ లంచాలకు లేకుండా ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల కు శంకుస్థాపన చేస్తుంటే చూసి ఓర్వలేక శిలాఫలకం ధ్వంసానికి పాల్పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట గ్రామ అధ్యక్షులు మారేపల్లి వరదరాజులు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ బుజ్జన్న నాయకులు చిందం రవి దుబాసి కృష్ణమూర్తి విధంగా గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు…..