

బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.
జనం న్యూస్ జూన్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
నరేంద్ర మోదీ, ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీబీపేట పట్టణ బీ జే పీ అధ్యక్షుడు సూరు సురేష్,మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా సోమవారము బీబీపేట్ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించామని అన్నారు. నేరేంద్ర మోదీ, హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా చేరుతున్నాయని అన్నారు. అన్నదాతలకు అండగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని అన్నారు.భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దే క్రమంలో మోదీ, అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రతి బీజేపీ కార్యకర్త అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు నక్కరాజు,నారాయణ,మహేష్,నవీన్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.