Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి నందుకు ఉత్తమ ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారని విద్యార్థి తండ్రి. ఉపాధ్యా యుడు.షేక్ రౌఫ్ బాష తెలిపారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మహతి ఆడిటో రియం లో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటే శ్వర్. రెవెన్యూమంత్రి మరియు తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు ఏ.సత్య ప్రసాద్. తిరుపతి. సత్యవేడు.చంద్రగిరి ఏం.ఎల్.ఏ.,లు ఏ.శ్రీనివాసులు,కె.ఆదిమూలం.,పి.వి.ప్రసాద్..తదితరుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం,జ్ఞాపిక.పతకం,ఇరవై వేల రూపాయలు చెక్కు. అందుకున్నారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఇమ్రాన్ మాట్లాడుతూ తాను నందలూరు ప్రతిభా స్కూల్ లో ప్రాథమిక విద్య,ఆల్విన్ మౌంట్ కార్మెల్ స్కూల్ లో మాధ్యమిక విద్య,తిరుపతి శ్రీధర్ అకాడమీ కళాశాల లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించినట్లు ప్రస్తుతం VIT అమరావతి లో బి.టెక్. మొదటి సంవత్సరం లో ప్రవేశం పొందినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఇమ్రాన్ ప్రతిభాపాటవాలు పట్ల మండల ప్రజలు, ఉపాధ్యాయులు, హర్షం వ్యక్తం చేశారు.