Listen to this article

జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగు రాష్ర్టాల్లోని రైతన్నలందరికీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు.వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.విస్తారమైన వర్షాలతో నదులన్నీ నిండి పంట భూముల్లో సిరుల పంటలు పండాలని, రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరవాలని ఆకాంక్షించారు.