Listen to this article

జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

84వ డివిజన్ లో కార్పొరేటర్ చిన్నతల్లి నీలబాబు జీవీఎంసీ సమావేశంలో మంజూరు చేసిన నిధులతో కొప్పాక వీలైన గ్రామాల్లో 50 లక్షలు నిధులతో ప్రజలు అభ్యర్థనపై సిమెంట్ కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు ప్రారంభమయ్యాని, ఈరోజు ఉదయం నీలబాబు కొప్పాక గ్రామం పర్యటించి పనులు జరుగుతున్న నాణ్యత ప్రమాణాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారని, అవినీతికి ఎక్కడ తావు లేకుండా పనులు జరగాలని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు నీలబాబు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బోయిన మురళి వానపల్లి బాబురావు గోపి బాలాజీ చిన్న తదితరులు పాల్గొన్నారు.//