

జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రమేష్ పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కష్టపడి పనిచేసి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు రమేష్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, కూకట్పల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య , శివ చౌదరి రమణ తదితరులు ఉన్నారు.