

జనం న్యూస్,జూన్11,అచ్యుతాపురం:
అచ్యుతాపురం అయ్యప్పస్వామి గుడి పక్కన ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకులో పెట్రోల్లో నీళ్లు వచ్చాయని
వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అచ్యుతాపురం మండలం చోడపల్లికి చెందిన తరుణ్ తన బైక్ లో అయ్యప్పస్వామి గుడి పక్కన ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకులో రూ.150 పెట్రోల్ పోయించుకొని వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక బైక్ సడన్గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూపించాడు.
ట్యాంక్ లో పెట్రోల్ ను బాటిల్లో నింపగా అందులో పెట్రోల్ లో నీళ్లు కలిసినట్టు తేలడంతో ఆ యువకుడు కంగు తిన్నాడు. సదరు హెచ్ పి పెట్రోల్ బంక్ కు వెళ్లి నిర్వహకులను నిలదీసి అడగ్గా తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న సదరు బంక్ మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు తరుణ్ కోరారు.