

జనం న్యూస్ 12 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
దివ్యాంగులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాల పట్ల అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చైతన్య యాత్ర ప్రచారం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ ఆధ్వర్యంలో విస్కృతంగా చేపడుతున్నారు. బుధవారం పట్టణంలోని 50, 51,52 సచివాలయాల పరిధిలోనూ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్స్ అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా వాటిపట్ల సరైన అవగాహన లేకపోవడం వలన వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నారని అన్నారు. దివ్యాంగులు ఆటలు ఆడటం వలన శారీరక, మానసిక వికాసం కలగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించిన దివ్యాంగులకు కోట్లాది రూపాయలు నగదు ప్రోత్సాహలతో బాటు, విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఉచిత కోచింగ్ క్యాంప్ ల నుండి ఉద్యోగాలు పొందేవరకు అసోసియేషన్ అండగా ఉంటుందని దివ్యాంగులు, వారి తల్లితండ్రులు ఈ అవకాశాలు అందిపుచుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. ఆశక్తి గలవారు 9849377577 నంబర్ ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ లు రామారావు, ch. పార్వతి, వెల్ఫేర్ సెక్రటరీలు అప్పలరాజు, అమర్, జగదీశ్, వైద్యులు లక్ష్మీ, ఆశా వర్కర్స్ హాసిని, విజయ, కుమారి, సునీత, శ్రావణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.