Listen to this article

జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో అన్నదాత సుఖీభవ పధకం నకు సంబంధించి మండలంలో గల అర్హులైన రైతులు అందరూ మీ సమీపంలో గల రైతు సేవా కేంద్రం నకు వెళ్లి ఈ నెల 20 వ తారీఖు లోపు బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవలెను .. ఈ నెల 21 వ తారీఖు న అన్నదాత సుఖీభవ 5,000/-రూ. మరియు పియం కిసాన్ 2,000/- రూ . సంబంధించిన రైతు బ్యాంక్ ఖాతాల్లో జమచేయబడును కావున రైతులు అందరూ తమ ఆధార్ కార్డు తీసుకుని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రం నకు వెళ్లి ఈ నెల 20 వ తేదీ లోపు బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ వేయవలసిందిగా కాట్రేనికోన మండల వ్యవసాయాధికారి శ్రీ కె.ప్రవీణ్ గారు తెలియచేస్తున్నారు.