

జనం న్యూస్ జూన్ 13
సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజక వర్గం పరిధిలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డి.ఎస్.పి ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. పాశమైలారంలోని ఉష మాగ్వైర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ 16 తారీఖున సెక్యూరిటీ గార్డు హత్య చేసిన ఘటనబీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భానూర్ బీడీఎల్ పోలీసుల కథనం ప్రకారం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఉష మాగ్ వైర్స్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో దొంగతనానికి వచ్చి సెక్యూరిటీ గార్డును హత్య చేసి పారిపోయిన నిందితులను బీడీఎల్ బానూర్ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు.45 రోజుల తర్వాత కేసును చేదించిన బీడీఎల్ భానూర్, సంగారెడ్డి సిసిఎస్ పోలీసులతో కలిసి పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన ఎనిమిది మంది ఈ నెల 16 న రాత్రి దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డు కైరత్ మియా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కర్రలతో కొట్టి హత్య చేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తులను సాంకేతిక టెక్నికల్ ఆధారంగా నిందితులను 45 రోజుల తర్వాత పట్టుకున్నామని డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఇద్దరు పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని,ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్7 తరలించామని నిందితులు బొంతపల్లి వాసులు అని వెల్లడించారు. హత్యకేసును చేదించిన పోలీసులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందిచారని డి.ఎస్.పి తెలిపారు.ఈ కేసు ను చేదించిన వారిలో శివకుమార్ సిసిఎస్ సీఐ సంగారెడ్డి, స్వామి గౌడ్ బానూర్ బీడీఎల్ సిఐ, రామానాయుడు సిసిఎస్ సీఐ 2 సంగారెడ్డి ,శ్రీకాంత్ ఎస్సై సిసిఎస్ సంగారెడ్డి, పి లక్ష్మారెడ్డి బీడీఎల్ బానూర్, మహేశ్వర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐ సంగారెడ్డి, అన్వర్ సిసిఎస్ కానిస్టేబుల్, శశి సిసిఎస్ కానిస్టేబుల్, సలీం సిసిఎస్ కానిస్టేబుల్, మోహన్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రశాంత్ సిసిఎస్ కానిస్టేబుల్, సతీష్ సిసిఎస్ కానిస్టేబుల్ లు పాల్గొన్నారని డీఎస్పీ వివరించారు.