

జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి
అహ్మదాబాద్ లో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది , తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాజాగనగరం అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందటం వీరిలో 169 మంది భారతీయులు 53 మంది ఇంగ్లాండ్ పౌరులు 7 పోర్చుగల్ పౌరులు 1 కెనడియన్ 12 మంది విమాన సిబ్బంది మృతి చెందడం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మృతి చెందడం బాధాకరమైన విషయం అని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు