

జనం న్యూస్ జూన్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసులు, మోటారు ట్రాన్స్పోర్ట్ రోడ్డు నిభందనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు.రాజీయే రాజ మార్గమన్నారు.చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృదా చేసుకోవద్దన్నారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు సంభందిత పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందన్నారు.