

బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 13 (జనం న్యూస్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంభం మండలం మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా షేక్ ఇబ్రహీం అధికారికంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంభం మండలం మైనార్టీ సెల్ విభాగము అధ్యక్షులు గా నియామకం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు, నాపై నమ్మకంతో నన్ను సిఫార్సు చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.కంభం మండలం వైసీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని షేక్ ఇబ్రహీం ఓ ప్రకటనలో తెలిపారు.