

సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలి- సోమ దేవరెడ్డి, శివాన్నోళ్ల శివకుమార్
జనం న్యూస్ జూన్ 13:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : తొర్తి గ్రామము లో శుక్రవారం రోజునా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలధ్యక్షుడు సోమ దేవరెడ్డి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహాలక్ష్మి పథకం రూ 500 లకే గ్యాస్ సిలిండర్ , కరెంటు ఛార్జ్లు యూనిట్లు 200 వరకు ఫ్రీ, ఇందిరామ్మా ఇల్లుఈ పథకాలు అర్హులైన అందరికి అందేలా కార్యకర్తలు కృషిచేయాలని మాట్లాడారు. జిల్లా ఉపాధ్యక్షులు శివాన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మన ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోనే అర్హులు అందరికి రేషన్ కార్డులు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూసిన్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్క పౌరునికి వివరించి రాబోయే స్థానిక ఎన్నికలలో మంచి మెజారిటీ తో మనవాళ్లేనే గెలిపించటానికి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగప్రసాద్,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దానం గంగామోహన్, మండల ఉపాధ్యక్షులు కౌడ బుమేశ్వర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సుమన్ గౌడ్, గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అడ్వాల లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బెజ్జరం బాను, Dr. షేకర్, జంబూక శంకర్, సురేష్, జంబూక రాజన్న, అన్వేష్, మమ్మాయి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు