Listen to this article

మంత్రి పొన్నం ప్రభాకర్

జనం న్యూస్, జూన్ 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అభినందనలు, శుభాకాంక్షలు, తెలియజేసారు. ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం విడతల వారిగా 5 లక్షల రూపాయలు సహాయం చేస్తుందన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ఇల్లు నిర్మాణాన్ని 400- 600 స్క్వేర్ ఫీట్ లోపే ఇల్లు నిర్మించాలన్నారు.ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మహిళా సంఘాల నుండి లక్ష రూపాయల రుణం అందిస్తుందని తెలిపారు.10 సంవత్సరాల తర్వాత ప్రజా పాలన ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాల ప్రభుత్వం అని ఇ సందర్బంగా మాట్లాడారు.ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.