

జనం న్యూస్ జూన్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ద్వీచక్రవాహనం ఢీకొని మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని 363 జాతీయ రహాదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గేడం సోమేశ్వర్(30) అనే వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సోమేశ్వర్ నివాసం ఎమ్మార్వో కార్యాలయానికి సమీపంలోనే ఉండగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. 363 జాతీయ రహాదారి దాడుతున్న క్రమంలో మహారాష్ట్ర వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 20 సి 0104 నంబరు గల ద్వీచక్రవాహానం వేగంగా ఢీ కొట్టింది. దీంతో సోమేశ్వర్ తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్వీచక్రవాహన దారుడు కొమురం మల్కుకు సైతం రక్తపు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆంబులెన్స్ ద్వారా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమేశ్వరు తీవ్ర రక్త స్రావం కావడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. కొమురం మల్కు పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి తమ్ముడు గేడం సూరజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.