Listen to this article

జనం న్యూస్ 14 జూన్ భీమారం మండల ప్రతినిధి

కాసిపేటరవి చెన్నూరు నియోజవర్గం శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి మైనింగ్ గనులశాఖమంత్రి పదవి వరించడంతో శనివారం రోజున భీమారం మండలంకు విచ్చేసిన సందర్భంగా భీమారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శాలువ,పూల మాలతో సత్కరించారు, అనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవా సుపరిపాలన,పేదల సంక్షేమమునకు 18 నెలల పాలనపై ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రదర్శనను కాంగ్రెస్ నాయకులతో కలసి మంత్రి వివేక్ వెంకటస్వామి, తిలకించారు, పేద బడుగు బలహీన వర్గాలకు సేవ లాంటి ఎన్నో సంక్షేమ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దారిద్య రేఖకు దిగువనున్న కోట్లాదిమంది ప్రజల జీవితాలలో వెలుగుని నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ప్రజల ప్రియతమ నేతగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు