Listen to this article

రాజీ మార్గమే రాజా మార్గం అంటున్న బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి శ్రీ.జే.వినీల్ కుమార్.

హర్ష వ్యక్తం చేస్తున్న బిచ్కుంద న్యాయవాదులు.

బిచ్కుంద జూన్ 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లాలో రెండవ స్థానంలో బిచ్కుంద కోర్టు.
ఈ రోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా బిచ్కుంద కోర్టులో మొత్తం రెండు వందల డెభై మూడు (273) కేసులను పరిస్కరించినట్లు బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి శ్రీ.జే.వినీల్ కుమార్, మండల లోక్ అదాలత్ మెంబెర్స్ శ్రీ. ఏ.ప్రకాష్ పటేల్ మరియు ఈ. శివాజీ లు పేర్కొన్నారు, ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు మరియు వాదులు మరియు ప్రతివాదులు పాల్గొన్నారు, దీంతో బిచ్కుంద కోర్టు కామారెడ్డి జిల్లాలో రెండవ స్థానంలో నిల్చిందని వారు తెల్పినారు, ఇట్టి కార్యక్రమానికి హాజరై సహకరించిన ప్రతి ఒక్కరికి మండల కోర్టు వారి తరఫున ధన్యవాదాలు తేల్పినారు. బిచ్కుంద కోర్టులో గత మూడు సంవత్సరాల నుంచి న్యాయమూర్తి లేకపోవడంతో చాలా రకాల కేసులు పెండింగ్లో ఉండి, వాదులు, ప్రతివాదులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురి అయినారు, ఒక్క నెలలోనే ఇన్ని కేసులను న్యాయమూర్తి శ్రీ. జే.వినీల్ కుమార్ గారు పరిష్కరించడం వలన బిచ్కుంద పరిసర ప్రాంత ప్రజలు మరియు న్యాయవాదులు హర్షవ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న తగదాలు చేసుకుని కోర్ట్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా కేసులను త్వరితగతిన పరిష్కారం చేసుకోవాలని న్యాయమూర్తి గారు పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో న్యాయమూర్తి శ్రీ. జే. వినీల్ కుమార్, లోక్ అదాలత్ మెంబర్లు ఏ.ప్రకాష్ పటేల్ & ఈ.శివాజీ, న్యాయవాదులు ఎం.లక్ష్మణ్ రావు, జి. మల్లేశ్, టి. విఠల్, ఏ. విఠల్ రావు, రాజేష్ దేస్ముక్, శంకర్ రావు, మొహమ్మద్, మనోజ్, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.