

జనం న్యూస్ జాన్ 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
అంకిత భావంతో పనిచేసే వారికే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్పీఎం దయాకర్ అన్నారు.పోస్టల్ శాఖ లో గత 45 సంవత్సరాలుగా నిబద్దతతో పనిచేసి నేడు పదవీవిరమణ పొందిన నాగార్జునపు బ్రహ్మచారిని మునగాల మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు.ప్రతి ఒక్కరూ తమ వృత్తిని అంకిత భావంతో పని చేసి ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందరని అన్నారు. అనంతరం ఉద్యోగులు ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంవో అశోక్, బీపీఎంలు వెంకట రెడ్డి, హరి, సందీప్, దివ్య, మోతిలాల్, సనీల్, తదితరులు పాల్గొన్నారు.