

జనం న్యూస్ 16 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భోగాపురం విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 3.8 కిలోమీటర్ల మేర రన్ వే నిర్మించారు. రన్ వే ప్రహరీను ఆనుకొని జిరాయితీ భూముల్లో కొబ్బరి, నీలగిరి, టేకు తదితర చెట్లు ఉన్నాయి. నిర్మాణ సంస్థ ఇటీవల నావిగేషన్ సర్వే చేపట్టగా చెట్లతో సిగ్నల్ సమస్య ఏర్పడుతుందని గుర్తించారు. సుమారు 1500 చెట్లు గుర్తించి వాటి తొలగింపునకు అధికారులు మార్క్ చేశారు. వచ్చే ఏడాదిలో ప్రారంభించేదుకు కసరత్తు చేస్తున్నారు.