Listen to this article

జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నల్గొండ జిల్లా నాయకులు ఎస్ కె.బషీర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం నాడు నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో మున్సిపాలిటీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు కవచకుండలాలు లాంటి 34 కార్మిక చట్టాలను తొలగించి దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్రం చూస్తుందని దీనికి వ్యతిరేకంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో మునిసిపాలిటీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 26 వేల రూపాయల కనీస వేతన చట్టం అమలు చేస్తూ పిఎఫ్, ఈఎస్ఐ ని వర్తింపజేయాలని కోరారు. మున్సిపాలిటీ కార్మికులకు ప్రతినెల ఆదివారాలు సెలవు ఇవ్వాలని అన్నారు. 10 లక్షల రూపాయల మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ దానితోపాటు హెల్త్ కార్డులను మున్సిపాలిటీ కార్మికులకు వర్తింప చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యం బారిన పడకుండా అవసరమైన వస్తువులను అందజేయాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్మికుల సంక్షేమ సంఘాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శివ, ఉపాధ్యక్షులుగా నాగ భాస్కర్, కార్యదర్శిగా తాహేర్,మహిళా ఉపాధ్యక్షురాలుగా ఏ బాలమ్మ,సహాయ కార్యదర్శులుగా వెంకటరెడ్డి మహిళా సహాయ కార్యదర్శిగా మణి తదితరులను ఎన్నుకున్నారు.