

జనం న్యూస్ జూన్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల పరిధిలోని ఆకుపాముల రైతు వేదికలో రైతుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను కేసాగాని వీరబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కోదాడ ఆర్డివో సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతుల దాహార్తిని తీర్చడానికి వాటర్ కూలర్ ఇవ్వడం అభినందనీయమన్నారు. కేసగాని వీరబాబు ఈ ప్రాంత రైతుగా ఉంటూ ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ తో చనిపోవడం బాధాకరమని, అతని కుటుంబానికి రైతు బీమా సకాలంలో అందించడంలో కృషిచేసిన వ్యవసాయ అధికారులను అభినందించినారు. రైతులు వ్యవసాయ సలహాలు, సూచనలు తీసుకొని సేంద్రియ పద్ధతులలో మంచి లాభాలు గడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో శిరీష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓ రేష్మ, తదితరులు పాల్గొన్నారు.