

మద్నూర్ జూన్ 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గొజ్జగావ్ గ్రామంలో నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ భూభారతి సదస్సులో పాల్గొన్నారు సోనాల గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు. సోనాల గ్రామంలో భూభారతి సదస్సులో 10 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే గొజ్జ గావ్ గ్రామంలో 6 దరఖాస్తులు వచ్చాయి మొత్తము16 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు,
