Listen to this article

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గ్రామీణాభివృద్ధి జరగాలంటే ఉపాధిహామీ పథకంలో పనిచేసిన ప్రతి పనికి వెంటనే నిధులు విడుదల చేయాలని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు రాసిన లేఖను విజయనగరంలో మంగళవారం విడుదల చేశారు. గ్రామీణ అభివృద్ధికి చేపట్టిన అనేక పనులకు సంబంధించి గడిచిన 6 నెలలుగా బిల్లులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బిల్లు మంజూరు చేయాలని కోరారు.