Listen to this article

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్:- గోపికృష్ణ పట్నాయక్ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్డ్‌ మోహన్‌ బనార్కర్‌ ఈనెల 19న విజయనగరం రైల్వే స్టేషన్లో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఆర్పీఎఫ్‌ పోలీసుల సహకారంతో గౌహతి ట్రైన్‌లో బాలుడి ఆచూకీ లభ్యమైనట్లు ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ గురువారం తెలిపారు. త్రిపుర సమీపంలోని ధర్మనగర్‌ వద్ద విద్యార్థి ఆచూకి గుర్తించామని తెలిపారు.