Listen to this article

గిద్దలూరు ప్రతినిధి, జూన్ 21 (జనం న్యూస్):

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం యూత్ వింగ్ అధ్యక్షులు, బురుజు పల్లె ఎంపీటీసీ, శీలం రంగారెడ్డి (సిఐడి) గిద్దలూరు మండల కేంద్రమైన బురుజు పల్లె గ్రామానికి చెందిన సీఐడీ రంగారెడ్డి ని నియమించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కుందురు నాగార్జునరెడ్డి గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా సిఐడి రంగారెడ్డి మాట్లాడుతూ నా మీద అభిమానంతో నాకు గిద్దలూరు మండల యూత్ వింగ్ అధ్యక్షులు గా నియమించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి, మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుందురు నాగార్జున రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నేనెప్పుడూ మీకు రుణపడి ఉంటానని, మీరు ఏ పని అప్పగించిన, ఈ కార్యక్రమం చేపట్టమన్న మీ యొక్క ఆదేశాల మేరకు తప్పక పాటిస్తూ పార్టీ బలోపేతానికి అన్నివేళలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండల యూత్ వింగ్ అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా “సీఐడీ” రంగారెడ్డి కి పలువురు మండల వైసీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు అభినందించారు.