

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మాగం విశ్వనాథరాజు కాలనీ లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్గీ బలిదాన్ దివస్ (వర్ధంతి ) కార్యక్రమం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వేటుకూరి శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో అయినవిల్లి మండలం మాగం-197 పోలింగ్ బూత్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిది గా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు పాల్గొని ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖర్గీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాబినెట్ లో మంత్రిగా పనిచేసి వారి విధానాలు నచ్చక రాజీనామా చేసి తొలి హిందూ వాద రాజకీయ పార్టీ ని నెలకొల్పి జాతీయ ఐక్యత, దేశ ఉజ్వల భవిష్యత్తు కు కృషి చేసిన మహా నేత, విద్యా వేత్త, రాజనీతుజ్ణుడు మఖర్జీ అని అన్నారు నెహ్రూ ప్రభుత్వం కాశ్మీర్ కు 370 ఆర్టికల్ ద్వారా స్వయం ప్రతి పత్తి కల్పిస్తే ముఖర్గీ వ్యతిరేకించి ఈ దేశంలో ఒకే జెండా, ఒకే చట్టం, ఒక్కరే ప్రధాని ఉండాలని, దేశమంతా ఒకటే అని నినదించారు, చివరకు 1953 జూన్ 23 వ తేదీ న ముఖర్జీ కాశ్మీర్ జైలు లో అనుమానాస్పదం గా మృతి చెందారు. ఆయన కన్న కలలు నేడు మన ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 ని రద్దు చేసి, ముఖర్జీ నిజమైన నివాళులు అర్పించారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేశారు. అమ్మకోసం ఒక మొక్క అనే నినాదంతో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి పి.గన్నవరం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ చీకురుమేల్లి వెంకటేశ్వరరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ గనిశెట్టి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు కుడుపూడి చంద్రశేఖర్ కొప్పనాతి శ్రీరామ చంద్ర మూర్తి, పర్యావరణం మండల కన్వీనర్ యనమదల వెంకటరమణ, తాడినాటి వెంకటేశ్వరరావు, పనింద్ర, సత్యనారాయణ, వెంకన్న బాబు, మహిళలు, కార్యకర్తలు ,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
