Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాటూరు నుండి ఇద్దరు విద్యార్థులు వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపుల పాయలో ఉన్న త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయ్యారు టి. మణిదీప్ S/O నరసయ్య యం. షణ్ముఖ శ్రీనివాస్ S/O యం. బలరాం. ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డులు కూడా అందుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత మరియు ఉపాధ్యాయులు పాటూరు గ్రామ ప్రజలు విద్యార్థులను అభినందించారు.