Listen to this article

ప్రపంచం సులభమైంది,వేగం పెరిగింది,సాంకేతికత దగ్గరైంది,దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది,అవకాశాలు వచ్చాయి.

పాటిల్ ఉదయ్ కుమార్ పత్రిక ప్రతినిధి

జనం న్యూస్,జున్ 27, కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పత్రిక ప్రతినిధి పాటిల్ ఉదయ్ కుమార్, శుక్రవారం నేటి సమాజంలో జీవించే మనుషుల,కథనం : పన్నెండు గంటల ప్రయాణం నాలుగు గంటల్లో పూర్తవుతోంది,
అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.నాలుగు వారాలు పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకండ్లలో వస్తోంది,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది,ఇప్పుడది కేవలం ఒక సెకండ్లో కనిపిస్తోంది,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.ఇంట్లో పైకి కిందకి వెళ్ళడానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తోంది,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.బ్యాంక్ లో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి,ఇప్పుడు మొబైల్ లో కొన్ని సెకన్లలో లావాదేవీలు చేస్తున్నాడు,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి,అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు.ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్,ఇంకో చేతిలో ఫోన్ ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు.కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్,ఇంకో చేతిలో వాట్సాప్
ఎందుకంటే సమయం లేదు.ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు
ఎందుకంటే సమయం లేదు.నాలుగుమందితో కూర్చున్నా అసహనంగా ఫోన్‌లో వేలు వేశాడు
ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి సమయం లేదు.ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు,కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు ఎందుకంటే సమయం లేదు.పుస్తకం చదవడానికి సమయం లేదు,తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు,మిత్రుడిని కలవడానికి సమయం లేదు,
ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు.కానీ ఐపీఎల్ కోసం సమయం ఉంది,నెట్‌ఫ్లిక్స్ కోసం సమయం ఉంది,రీల్స్ కోసం సమయం ఉంది,రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది,కానీ తనకోసం సమయం లేదు.ప్రపంచం సులభమైంది, వేగం పెరిగింది, సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి. కానీ మనిషి “సమయం లేదు” అంటూ తనను తానే మర్చిపోయాడు.
నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి, తనను అర్థం చేసుకోవడానికి, కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వడానికి సమయం లేదు అంటున్నాడు.ఒకరోజు నిజంగానే సమయమ్ వెళ్లిపోతుంది.ఆఖరి క్షణంలో అర్థమవుతుంది,ఏమంటే సమయం ఉండింది.కానీ మనమే “సమయం లేదు” అంటూ జీవించడాన్ని మరిచిపోయాము.కాబట్టి,ఈరోజే నిర్ణయం తీసుకోండి మీకోసం కొద్దిగా సమయం కేటాయించండి,
బంధాల కోసం కొంత సమయం పెట్టండి,మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితమ్ అర్థం చేసుకోవడం కోసం
కొంత సమయం వెచ్చించండి.ఎందుకు భూమిమీదకి వచ్చాం అని ఆలోచించడానికి సమయం లేదు”అనేది నిజం కాదు,అది కేవలం అలవాటు మాత్రమే.దానిని మార్చాలి.అందరు బాగుండాలి అందులో నముండాలి.