Listen to this article

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నందు గల ప్రభుత్వ పాఠశాల గత నాలుగు సంవత్సరాల నుండి మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను నేడు ఎం ఈ వో గడ్డం బిక్షపతి తిరిగి ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాల అవసరాన్ని గుర్తించిన గ్రామస్తుల అభ్యర్థన మేరకు మండల విద్యాధికారి తక్షణం స్పందించి ప్రత్యేక చొరవ చూపడం ద్వారా పాఠశాల తిరిగి తెరుచుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పిల్లల కు సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి, ఎం పి ఇ ఓ ఎ ఎస్ ఓ ఆర్ ఐ హాజరు కావడం జరిగింది సభను ఉద్దిశించి ఎం పి ఇ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బతికించే ప్రయత్నం చెయ్యడం అభినందనీయం అనీ ప్రశంశించారు. విద్యే ప్రగతికి సోపానమని ఎ ఎస్ ఓ పేర్కొన్నారు. ఆర్ ఐ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని అందరు ప్రభుత్వ పాఠశాల కు పంపించాలని అన్నారు మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల నిలదొక్కుకునే విధంగా పై అధికారులతో మాట్లాడి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని గ్రామస్తులకు హామీ ఇచ్చారు గ్రామస్తులు తమ పిల్లలను తప్పక ప్రభుత్వ బడికే పంపిస్తామని తెలియజేసారు