Listen to this article

జనం న్యూస్ 06 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకరణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్‌ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్‌ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం రిమాండ్‌కి తరలించారు.