Listen to this article

జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి.

నిజామాబాదు సర్వసమాజ్ కమిటీ మరియు విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం, గాజుల్ పేట్ వారి ఆధ్వర్యంలో 13 తేది ఆదివారం నాడు జరిగే ఊర పండుగకూ అంకురార్పణగా గాజులు పేట్ వీధిలల్లో బండారునూ పోయటం జరిగింది, ఈ సందర్బంగా సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ మన పెద్దల ద్వారా అనావాయితీగా ఆచారం అనుగుణంగా ఈ ఆషాడ మాసంలో వర్షాలు సంవురుద్దిగాపడాలని, ఈ దేవతల పండుగలనూ చెయ్యటం ద్వారా పశు సంపద, పాడి పంటలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయాని మరియు పిల్లలు& పెద్దలు (ముసలి వాళ్ళు) ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా వుంటారని, ఎటువంటి దృష్ట్ర శక్తులు దరి చేరవని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ జాయింట్ సెక్రటరీలు మల్కాయ్ సుదర్శన్, పసుల రాజు కార్యవర్గ సభ్యులు కొత్మీర్ సతీష్, శ్రీ విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్, పెద్ద కాపులు కోరడి చిన్న నర్సయ్య, మల్కాయ్ లక్ష్మినారాయణ, కోర్వ భూపాల్, గంట పెద్ద నర్సయ్య, ప్రతినిధులు భైర శైలేందర్, కోరడి గోపి, ఈర్ల సాయన్న, ఆదే నర్సయ్య, వెల్మల్ గంగాధర్, కోటకింది నర్సయ్య, కొత్మీర్ పెద్ద సాయన్న, నరాల చక్రధర్, బెల్లల్ కుమార్, రామాడ్గు బాలకిషన్, మల్కాయ్ మహేందర్, సుంకటి శేఖర్, కోటకింది శేఖర్, కొట్టె సాయిబాబా, సుంకేటి విశాల్, భైర రమేష్ తదితరులు పాల్గొన్నారు…