

జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ రిపోటర్. కె ఏలియా.
జైనూర్, ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మణియ మని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళరిపించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ పథకం, అత్యవసర ఉచిత వైద్య సేవల కోసం 108, 104 వంటి బృహత్తర కార్యక్రమాలు అమలు చేసిన మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు..మహానేత వైయస్ స్పూర్తితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. పదేళ్లలో తెరాస హయంలో నిలిచిన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ ప్రజా పాలనలో మళ్లీ ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పంద్ర షేకు, ఆత్రం భుజంగరావు, నాయకులు మెస్రం అంబాజీ, కనక గంగారం, షేక్ వసీం, రాథోడ్ రాందాస్, ఆత్రం దత్తు, గెడం గోపిచంద్, తుమ్రం కొటే ష్, ఇస్లాం, రహీమ్, షెడ్మ రావు తదితరులు పాల్గొన్నారు.
