Listen to this article

జనం న్యూస్ – జులై 9-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ వనంలో గురువారం నాడు ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. గయా లో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ జింకల వనములో ఆషాడ పౌర్ణమి రోజున మొదటిసారిగా తన శిష్యులకు ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. బౌద్దులు, బౌద్ధ అభిమానులు ఈరోజుని ఎంతో పర్వదినముగా భావించి బుద్ధుని జీవితంలో ముఖ్య ఘట్టాలలో ఒకటిగా ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవం గా జరుపుకుంటారు. బుద్ధవనం లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మహాబోధి బుద్ధ విహార బౌద్ధ బిక్షువులుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. నందికొండ మున్సిపాలిటీ ప్రజలు, బౌద్ధాభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుద్ధవనం నిర్వాహకులు కోరారు.