Listen to this article

జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడిక్కింది…గత కొన్ని రోజుల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ టీడీపీ… బాబు ప్యూరిటీ-మోసం గ్యారెంటీ అంటూ వైసీపీ… ప్రజల వద్దకు వెళుతున్నారు.జమిలి ఎన్నికలు వస్తున్నాయోమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.