Listen to this article

హైదరాబాద్, జనవరి 05: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించంది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతోన్నట్లు తెలిపింది.