Listen to this article

జనం న్యూస్26జూలై ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )

భీమారం మండల : వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని వర్షాకాలంలో నీరు నిలువ ఉన్నట్లయితే దోమలు వృద్ది చెందుతాయని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు వస్తాయని, కావున పరిసరాలలో పనికిరాని గుంటలు, లోతట్టు ప్రదేశాలు నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ఎండాకాలం వాడిన కూలర్లలో నీరు తీసేయాలని, చెత్తాచెదారం మురుగు కాలంలో చేరకుండా చూసుకోవాలని, మరుగుదొడ్ల గాలి గొట్టాలకు మెష్ కట్టించాలని, ఇంటి ఆవరణలోని పనికిరాని వస్తువులను పరిశీలించి నీరు నిలవకుండా తొలగింపజేయాలని, ఇండ్లలో నీరు నింపుకునే పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి ఆరబెట్టి మళ్ళి నింపుకోవాలని, పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, టైర్లు, పూల కుండీలలో నీరు నిలవకుండా చూసుకోవడం వలన దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, బోదకాలు, మెదడువాపు ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నాని
, ఆహారం తీసుకునే ముందు చేతులు పరిశుభ్రంగా కడుకోవాలని,గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని,వేడిగా ఉన్న ఆహారాన్నే తిన్నాలన్నారు.వ్యక్తిగత పరిభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పటంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు ,హెల్త్ అసిస్టెంట్ ,ఎయన్ఎంలు ,ఆశా కార్యకర్తలు, ప్రజలురోగాల బారిన పడుతున్న పట్టించుకున్న పాపానలేరని ప్రజలు వాపోతున్నారు