Listen to this article

జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకి, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు పొందారు. ఈసందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఇతర పోలీసు అధికారులు అభినందించారు.