Listen to this article

జుక్కల్ జులై 6 జనం న్యూస్

తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య” కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి జయంతిని మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు – నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ లు శివ రామకృష్ణ, శరత్, గిర్దవార్ ఏం శంకర్, మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.