Listen to this article

జనం న్యూస్, ఆగష్టు 06, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలము: మండల పరిధిలోని జగ్గాసాగర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నీలారపు శ్రీనివాస్ ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ మరియు టీబి వ్యాధిగ్రస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు మరియు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు గర్భిణి స్త్రీలతో వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేసుకోవాలని , సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలపై గ్రామాలలో అవగాహన కలిగించాలని సిబ్బందికి సూచించారు. ఓపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. మందుల స్టోర్ రూమ్ పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు.ల్యాబ్ ను పరిశీలించి టి హబ్కు పంపిస్తున్న శాంపిల్, క్షయ వ్యాధి సంబంధిత కేసుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లల అంజిత్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.