Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు పెనుబారంగా వారి ఇబ్బందులు గురి చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పునసమీక్షించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోమాట్లాడుతూ ఫార్మేట్ అసెస్మెంట్ పరీక్ష పరీక్ష పేపర్ ద్వారా నిర్వహించటం దానిని మరల బుక్లెట్ లో నమోదు చేయించడం మరలా బబ్లింగ్ ప్రక్రియ చేయించడం పూర్తి సమయం వృధా అవుతుందని తెలిపారు. SCERT వారు ముద్రించిన పుస్తకాలను సకాలంలో పాఠశాలకు చేరి చేర్చలేకపోవడం వలన ఆ వివరాలు నమోదు చేసుకోవడానికి ఒక రోజు పూర్తి టైం సరిపోతుందని తెలిపారు, మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలకు తెప్పించుకోవడం పాఠశాల నుంచి తరగతి వారీగా సబ్జెక్టు వారీగా వేరు చేసుకుని విద్యార్థుల వివరాలు నమోదు చేయడం తలకు మించిన భారం అవుతుందని తెలిపారు, ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేసిన తర్వాతమార్కులు రిజస్టర్ నందు మరియు ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉన్నందున ఈ భారాన్ని ఉపాధ్యాయులకు తప్పించాలని కోరారు, ఇప్పటికే అనేక యాప్ లతో ఇబ్బందులు పడుకున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహణ ఇబ్బంది గా మారిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ బుక్లెట్లను ఉపసంహరించుకోవాలని కోరారు, లేనిచో ఈ బుక్లెట్లు పూర్తి చేయడం బబ్లింగ్ చేయించడం పరీక్షల మార్కులు నమోదు చేయించడం వల్ల బోధనకుందుపడే అవకాశం ఉందని తెలిపారు, ప్రశ్నాపత్రాల తయారీ కూడా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా లేవని తెలిపారు, ఈ నూతన మూల్యాంకన విధానం వల్ల మంచి ఫలితాలు రాకపోగా విద్యార్థులకు నష్టదాయకంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి ఈ బుక్లెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు సమావేశంలో ఎస్టియు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి వి జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు