

తాసిల్దార్ వేణుగోపాల్
బిచ్కుంద ఆగస్టు 13 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం బిచ్కుంద మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తాసిల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎలాంటి విపత్తును అయిన ఎదుర్కోవడానికి సంబంధిత శాఖల అధికారులు సిద్ధం కావాలని అన్నారు. ప్రజలు భారీ వర్షంలో వాగులు దాటడం, విద్యుత్ స్తంభాలను తాకడం, చెట్ల కింద ఉండటం చేయరాదు అన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అన్నారు.భారీ వర్షంలో అత్యవసర పరిస్థితినీ ప్రజలు మండల తాసిల్దార్ గారికి ఫోన్ చేసి తెలుపగలరు ఈ సమీక్ష సమావేశంలో మండల తహసీల్దార్ వేణుగోపాల్ , ఎండిఓ ఎంపీడీఓ , మండల స్పెషల్ ఆఫీసర్ నాగేష్ , బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి ,మండల ఇరిగేషన్, విద్యుత్, మండల SHO విజయ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
